ఈ ప్రభుత్వానికీ చిక్కులు తెచ్చి పెడుతున్న వనజాక్షి ..!

తహసీల్దార్ వనజాక్షి…! ఈ పేరుకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాడు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ వనజాక్షిపై దాడి చేశారంటూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి వనజాక్షి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి తహసీల్దార్ వనజాక్షిపై ఏ ఎమ్మెల్యే దాడి చేయలేదు. ఆమెనే దాడి చేశారు. అదీ కూడా రైతులపై. మామూలుగా తోపులాట మాత్రమే కాకుండా.. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తిని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ… ఆమె వ్యాఖ్యలు చేయడంతో రైతుల్ని రెచ్చగొట్టినట్లయింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కోసం.. దశాబ్దాల నుంచి రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ ల్యాండ్స్‌ను స్వాధీనం చేసుకుంటోంది.

ఇందులో భాగంగా.. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లికి వనజాక్షి వెళ్లారు. అయితే.. భూములు ఇవ్వబోమని..అది తమ జీవనాధారమని రైతులు చెప్పారు. ఈ క్రమంలో… రైతులతో వాగ్వాదం జరిగింది.

రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని వనజాక్షి మండిపడటంతో… మహిళలు.. ఆమెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వనజాక్షి ని పోలీసు వాహనంలో తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వనజాక్షి ప్రవర్తన.. రైతుల పట్ల ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశమయింది.

ఆమె మొదటి నుంచి కృష్ణా జిల్లాలోనే విధులు నిర్వహిస్తూంటారు. కానీ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన జరిగినప్పుడు ఆమె సరిహద్దుల్ని దాటి… వెళ్లి తన విధుల్ని నిర్వర్తించే ప్రయత్నం చేశారు. ఆమె పరిధి కాకపోయినా గోదావరి జిల్లాలోకి వెళ్లారు. అప్పుడు.. చింతమనేని చేసిన దాడే హైలెట్ అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close