సాక్షిపై దళిత కార్డు ప్రయోగిస్తున్న వర్ల..!

తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్యకు.. ఇంత కాలం రాని డౌట్ వచ్చింది. అదేమిటంటే.. తాను చాలా కాలం నుంచి టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని… అన్ని మీడియాలు తన ప్రెస్‌మీట్లు కవర్ చేస్తూంటాయని..కానీ ఒక్కటంటే.. ఒక్క సారి కూడా.. తన మాటలు కానీ.. తన స్టేట్‌మెంట్లు కానీ..సాక్షి మీడియాలో రాలేదనేది ఆయనకు వచ్చిన డౌట్. ఈ విషయమే అడుగుతూ… వైఎస్ భారతికి బహిరంగలేఖ రాశారు. టీడీపీ అధికార ప్రతినిధిగా.. తన ప్రకటనలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం తాను.. దళితుడ్ని అయనందువల్లేనే చూపించడం లేదా అని ప్రశఅనించారు. మీడియాలో.. ఇలా సామాజికవర్గాల వారీగా చూసి.. ప్రాధాన్యలు ఇవ్వడం.. అసలు పట్టించుకోకపోవడం వంటి వాటిని తాను చూడలేదన్నారు.

పనిలో పనిగా.. ఐటీ దాడులు విషయంలో సాక్షిపత్రిక కథనాలను తప్పు పట్టారు. సాక్షి మీడియా.. టీడీపీకి చెందిన వార్తలను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. వారి వాయిస్ ను కూడా వినిపిస్తున్నామని చెప్పుకునేందుకు ఎక్కడో చోట.. రెండు, మూడు కాలమ్స్ వార్త ప్రచురిస్తుంది. అనేక మంది టీడీపీ నేతల స్టేట్‌మెంట్లు, ప్రెస్‌మీట్లు.. ఎంతోకొంత కవర్ చేసింది సాక్షి. అయితే.. వర్ల రామయ్యకు మాత్రం చాన్సివ్వడం లేదు. వర్ల రామయ్య… ప్రధానంగా.. లీగల్ ఇష్యూస్ మీద.. జగన్ కేసుల మీద.. వివేకా హత్య కేసుల మీద ప్రెస్‌మీట్లు పెడుతూంటారు. రాజకీయ, పాలనాపరమైన వార్తలకు సాక్షి అంతో ఇంతో.. కవరేజీ ఇస్తుందేమో కానీ.. ఇలాంటి వాటికి అసలు ఇవ్వలేదు.

ఈ విషయాన్ని వర్ల రామయ్య గుర్తించలేదో.. లేక.. తనను.. గుర్తించడం లేదనే విషయాన్ని.. సామాజికవర్గ కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారో కానీ.. లేఖ రాశారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. వర్ల రామయ్యకు సంబంధించిన వ్యతిరేక వార్తలు ఏమైనా వస్తే మాత్రం… సాక్షి చాలా సార్లు ప్రసారం చేసింది. కానీ ఆయన ప్రెస్‌మీట్లను మాత్రం కవర్ చేయడం లేదు. అదే… వర్ల రామయ్య అసహనానికి కారణం కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close