అమరావతిపై మళ్లీ సుప్రీంలో విచారణ జూలైలోనే !

అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఆరు నెలల సమయం తీసుకుని తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రాత్రికి రాత్రి విచారణ జరిపించేసుకోవాలని తాపత్రయ పడుతున్న జగన్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆయన ఎంత తొందరగా విచారణ జరగాలని కోరుకుంటే.. అంత ఆలస్యమవుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి ఈ రోజు విచారణకు వస్తే.. వెంటనే జూలై 11వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వ లాయర్లు ఉసూరుమన్నారు.

తీర్పుపై స్టే కోసం అదే పనిగా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. చివరకు విచారణ జూలైకు వాయిదాపడింది. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ కేఏం జోసెఫ్ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

అంతకు ముందు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారింది. పదో నెంబర్ గా ఉన్న అణరావతి కేసు అంతకంతకూ ఆలస్యమయింది. ఇతర నెంబర్ల కేసులుకూడా విచారణకు వచ్చాయి. దీంతో అమరావతి రాజధాని కేసు ఉండటంతో విచారణకు రాదేమోనని అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ ప్రభుత్వ లాయర్లు ప్రయత్నించారు. ఈ సందర్బంగా లాయర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

గుడివాడ టిడ్కో ఇళ్లు -పరువు పోగొట్టుకున్న కొడాలి నాని !

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close