పేటలో కడప ఎంపీ బంధువుల మైనింగ్.. మినిస్టర్ రజనీకీ నోటీసులు !

ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారనో… మంత్రి పదవి ఇచ్చారనో కానీ తన నియోజకవర్గంలో మైనింగ్ ను వైఎస్ అవినాష్ రెడ్డి బంధువులకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి విడదల రజనీకి చిక్కులు తప్పడంలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో కొంత కాలంగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దళితుల భూములు.
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ తీసుకొచ్చి.. ఈ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో ఆయా భూములు సాగు చేసుకుంటున్నరైతులు కోర్టుకెళ్లారు.

ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన కోర్టు మంత్రి విడదల రజనీ , ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు నోటీసులు వెళ్లాయి. అలాగే రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీలో ఎక్కడ మైనింగ్ జరిగినా వైఎస్ కుటుంబసభ్యుల పాత్ర బయటకు వస్తోంది. చిలుకలూరిపేటలోను వారే మైనింగ్ చేయడం.. దానికి తప్పుడు మార్గాలను ఎంచుకోవడం.. వారికి విడదల రజనీ సహకరించడంతో ఆమె కూడా ఇరుక్కుపోయినట్లయింది.

దళితుల భూముల్లో ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరంవ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. అప్పటి వరకూ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మంత్రి రజనీ ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మైనింగ్ విషయంలోనూ ఆమె పాత్ర ఉన్నట్లుగా నోటీసులు రావడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close