అంబటి రాంబాబు .. జగన్ కోసం రోజు మీడియా ముందుకు వచ్చి ఘోషిస్తున్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు అనుకునే పోస్టులు పెడుతున్నారు. ఆయన కష్టానికి మెచ్చిన జగన్ రెడ్డి ఓ పోస్టు ఇచ్చేశారు. సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి నుంచి పీకేసి.. వేరే వ్యక్తికి ఇచ్చిన తర్వాత అంబటికి పదవి లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకు ఎక్కడ చాన్స్ ఇవ్వాలా అని ఆలోచించిన జగన్.. చివరికి గుంటూరు పశ్చిమ ఖరారు చేశారు.
ఈ నియోజకవర్గం ఇంచార్జ్ గా అంబటిని నియమించారని తెలిసిన తర్వాత బాగా అయిందని అంబటిని చూసి నవ్వుకునేవాళ్లు వైసీపీలో ఎక్కువైపోయారు. ఎందుకంటే గుంటూరు పశ్చిమలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజనీ తన వల్ల కాదని మళ్లీ చిలుకలూరిపేటకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా ఆమె యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
గుంటూరు పశ్చిమలో వైసీపీకి ధీటైన నేత ఎవరూ లేరు. అప్పిరెడ్డి ఉన్నా.. ఆయనలో జగన్ రెడ్డి ఇంచార్జ్ ను అసెంబ్లీ అభ్యర్థిని చూడలేకపోతున్నారు. మేయర్ కావటి దండం పెట్టేసారు. పోనీ చివరికి అంబటికే టిక్కెట్ ఇస్తారా అంటే అలాంటిదేమీ లేదు. అంబటి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఖర్చు పెట్టుకుంటే చివరికి జగన్ ఎవరికి టిక్కెట్ ఇస్తారో తెలియదు. అక్కడ అంబటికి ఏమైనా బేస్ ఉందా అంటే ఏమీ లేదు. ఎలా చూసినా అంబటి రాంబాబుకు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవు.కానీ ఆయనను ఓ ఇంచార్జ్ గా పెట్టడానికి … డబ్బులు పెట్టించడానికి ఓ సీటు కావాలి. అందుకే గుంటూరు పశ్చిమను జగన్ ఎంచుకున్నారు.
రేపల్లెకు చెందిన అంబటికి సత్తెనపల్లిసీటు ఇవ్వడమే విచిత్రం. ఇప్పుడు ఆయనను గుంటూరుకు తెచ్చి పెట్టారు.