యోగి టు అమిత్ షా..! బీజేపీ “గ్రేటర్” గురి..!

భారతీయ జనతా పార్టీ .. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థపై ఆషామాషీగా గురి పెట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఉంది. బీజేపీ బలపడిందనే సూచనలు కనిపిస్తూండటంతో… ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతోంది. ప్రచారానికి మొత్తం వారం రోజులే గడువు ఉంది. ఈక నాలుగు రోజులే ఉంది. ఇలాంటి సమయంలో రోజుకో స్టార్ క్యాంపెయినర్ హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అమిత్ షా కూడా ఉన్నారు. ఇప్పటికే తేజస్వి సూర్య వచ్చారు. స్మృతి ఇరానీ వచ్చి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలు కూడా రాబోతున్నారు బీజేపీ లైనప్ చూస్తే… అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో.. వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

ఇక హిందూత్వ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ గరిష్ట స్థాయిలో వాడుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల దుమారం రేగింది. ఈ నినాదంతో హిందువుల ఓట్లను సమైక్యం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో.. ఇతర వర్గాల్లో అలజడి రేపి.. ప్రశాంతమైన నగరం కోరుకునేవారి ఓట్లను పొందాలని టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. ఎవరి స్కెచ్ వర్కవుట్ అవుతుందోకానీ.. ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్‌లో హిందూత్వ నినాదం తెరపైకి బలంగా వచ్చింది. మత ప్రాతిపదికన రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూలేదు.

భారతీయ జనతా పార్టీ ఎక్కడ రాజకీయంగా ఎదిగినా.. అక్కడ హిందూత్వ నినాదం బలంగా వెళ్లూనుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అదే జరుగుతోందని అనుకోవాలి. బీజేపీ నేతలు.. హైదరాబాద్ అంశంపై ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యాచరణ ఖరారు చేసుకుని రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. అమిత్ షా హైదరాబాద్ వచ్చి వెళ్తే… ఆ తర్వాత పరిస్థితి మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఒకటో తేదీనే పోలింగ్ కాబట్టి… ఈ మధ్యలోనే చాలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close