జగన్ విన్నపాలకి అమిత్ షా రియాక్షనేంటి…?

సాధారణంగా హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్ ఉంటే.. ఆఫీస్ అవర్స్‌లోనే ఇస్తారు. కాస్త తీరుబడిగా సమస్యలపై చర్చిస్తారు. మామూలుగా రాత్రి పది తర్వాత పార్టీ నేతలకు కూడా అపాయింట్‌మెంట్లు ఇవ్వరని చెబుతారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. అమిత్ షా .. రాత్రి పది గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అరగంట సేపు మాట్లాడి పంపేశారు. పదే పదే అడుగుతున్నారు కదా.. అని… కాస్త సమయం చూసుకుని కలిసినట్లుగా..ఈ భేటీ జరిగిందనే అభిప్రాయం ఢిల్లీలో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాలని..జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చారు. ఓ సారి అపాయింట్‌మెంట్ ఖరారైనా..ఆ రోజు పుట్టిన రోజు.. శుభాకాంక్షలు చెప్పి రావడమే తప్ప..గోడు వినిపించలేకపోయారు.

అయితే హఠాత్తుగా..ఓ శుక్రవారం అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైంది. రెండు రోజుల ముందు ప్రధాని మోడీని కూడా కలిశారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపనా పత్రాన్నే.. అమిత్ షాకు ఇచ్చారు. మోడీతో గంటన్నర సేపు మాట్లాడారని.. వైసీపీ ప్రకటించుకుంది. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి బయటకు వచ్చే వరకూ.. ఈ లెక్క ఉంది. అయితే.. అమిత్ షా ఇంట్లోకి వెళ్లినప్పుటి నుండి.. బయటకు వచ్చేసరికి లెక్కలేసుకున్నా.. ఆ సమయం గంట కూడా లేదు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పాలనుకున్నదాన్ని చెప్పారో లేదోనన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం… మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే చాలు అనుకున్నారు.

ఆ మేరకు.. అటు మోడీ.. ఇటు అమిత్ షాలకు ఇచ్చిన లేఖల్లో దాన్ని ప్రస్తావించారు. దాంతో కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామన్న తమ మాటలకు ఓ జస్టిఫికేషన్ తెచ్చుకున్నారు. వారి రియాక్షన్ ఏమిటో అన్నది మాత్రం బయటకు రాలేదు. బహుశా.. కేంద్రం తీసుకునే చర్యలు.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలే… చర్యలుగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఉత్సాహంగా కనిపించలేదని ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close