అనంత టీడీపీ బాధ్యతలు జేసీ ప్రభాకర్‌కి ఇచ్చారా !?

అనంతపురం జిల్లా టీడీపీ బాధ్యతల్ని తమకు చంద్రబాబు ఇచ్చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకున్నారు. తాడిపత్రిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇన్ని రోజుల అనంతరం కార్యకర్తలకు స్వేచ్చ ఇచ్చారని ప్రకటించుకున్నారు. చంద్రబాబు ఫోటోతో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జిల్లా మొత్తం తిరుగుతామని ప్రకటించారు. చంద్రబాబు అలా చాన్స్ ఇచ్చారో లేదో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకున్నారో కానీ ఇప్పుడీ విషయం టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది.

అనంతపురం జిల్లాలో టీడీపీకి దిగ్గజ నేతలున్నారు. సీనియర్లు ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వేలు పెట్టడానికి అంగీకరించరు. జేసీ సోదరులు వేలు పెట్టడానికి అసలు అంగీకరించరు. ఇటీవల పుట్టపర్తి వెళ్లి పల్లెరఘునాథ రెడ్డి అభ్యర్థిత్వంపై వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ తో పాటు పలు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతున్నారు. చివరికి కాల్వ శ్రీనివాస్‌కు కూడా టిక్కెట్ వద్దంటున్నారు. ఈ పరిస్థితుల్లో జేసీని హద్దుల్లో ఓ ఉండాలని ఓ సారి అచ్చెన్నాయుడు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

అయితే జేసీ కుటుంబం జగన్ ప్రతీకార రాజకీయాలకు దారుణంగా దెబ్బతిన్నారు. ఎలాగైనా దెబ్బకు దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉన్నారు. వారి వ్యాపారాలన్నింటినీ జగన్ దెబ్బకొట్టేశారు. బస్సులు.. లారీలు తిరగడం లేదు. మైనింగ్ బిజినెస్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఇతరుల కన్నా జేసీ బ్రదర్స్ కసిగా ఉన్నారని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కాస్తంత ఎక్కువ చొరవ తీసుకునే స్వేచ్చ ఆయనకిస్తారని భావిస్తున్నారు. అయితే సీనియర్లను సమన్వయం చేసుకోకపోతే అనంత టీడీపీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close