రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

హైదరాబాద్: అనంతపురంజిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఇవాళ చేసిన సుడిగాలి పర్యటన ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందనే చెప్పాలి. ఇవాళ ఉదయం బెంగళూరునుంచి అనంతపురంజిల్లా చేరుకున్న రాహుల్ ఓబుళదేవర చెరువు గ్రామానికి వెళ్ళి అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబసభ్యులకు 45మందికి రు.50,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పేదలు, రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ మాత్రమే పరిరక్షిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తే బీజేపీ వెనక్కు లాక్కుందని ఆరోపించారు. అక్కడనుంచి పాదయాత్ర చేపట్టారు. మధ్యలో ఆత్మహత్యచేసుకున్న కొందరు రైతుల కుటుంబాల ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కొండకమర్లలో పాదయాత్రను ముగించారు. దళితవాడకు వెళ్ళి ఒక దళితుడి ఇంట్లో భోజనం చేశారు.

రాష్ట్రాన్ని విభజించినందుకుగానూ కాంగ్రెస్‌ పార్టీని 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుగులేనివిధంగా చావుదెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదంటే ప్రజలకు ఆ పార్టీపై ఎంత ద్వేషం ఉందో చెప్పొచ్చు. ఎన్నికలకు ముందే పరిస్థితి అర్థమై అనేకమంది నాయకులు టీడీపీ, వైసీపీ పార్టీలలోకి జంప్ అయ్యారు. ఇక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు ఉడిగిపోయినట్లయింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏదో ఒక కార్యక్రమం చేపట్టి పార్టీలో కదలిక తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. అలాంటి పరిస్థితులలో ఇవాళ రాహుల్ చేసిన పర్యటన పార్టీలోకి కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. చిరంజీవి, కేవీపీ, పల్లంరాజు, రామచంద్రయ్య, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి, రామచంద్రయ్యవంటి అగ్రనేతలందరూ ఇవాళ్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన సక్సెస్ కావటంతో వారందరి ముఖాలలో ఉత్సాహం కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇలాగే ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూపోతే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close