ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణా హోం కార్యదర్శికి నోటీస్?

ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల హడావుడి మళ్ళీ మొదలయింది. మొన్న ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో దాఖలు చేసిన చార్జ్ షీటులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించారు. ఆయనను ఈ కేసులో దోషి అని చెప్పకపోయినప్పటికీ చార్జ్ షీటులో ఆయన పేరు చేర్చడం వెనుక ఉద్దేశ్యం మాత్రం అదేనని అర్ధమవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగా ఆయన పేరుని చార్జ్ షీటులో చేర్చారని ఏపి మంత్రులు, తెదేపా నేతలు తప్పుపట్టారు. తీవ్రంగా ఖండించారు. బహుశః అందుకు బదులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించింది.

తెలంగాణా ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిర్యాదు ఆధారంగా ఈరోజు తెలంగాణా హోం కార్యదర్శి రాజీవ్ త్రివేదికి ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నోటీసు ఇచ్చేందుకు కొద్ది సేపటి క్రితం తెలంగాణా సచివాలయానికి జేరుకొన్నారు. మరి ఆయన ఆ నోటీసును తీసుకొంటారో లేదో, తీసుకొంటే తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు స్టే ఉన్నందున ఆంద్రప్రదేశ్ మరో విదంగా దీనిని ముందుకు నడిపించినట్లుంది. కానీ ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను రెండు ప్రభుత్వాలు తమ రాజకీయ పగలు, ప్రతీకారాల కోసం ఈవిధంగా వినియోగించుకోవడం చాలా దురదృష్టకరం. ఎసిబి, సిట్ అధికారులు నిజంగా ఈ రెండు కేసుల్లో దోషులను పట్టుకొని శిక్షపడేలా చేయగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ రాజకీయ క్రీడలో ప్రభుత్వాలే వాటిని పావులుగా వాడుకోవడం, అవి వాటికి నిస్సహాయంగా సహకరించాల్సి రావడం చాల శోచనీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close