రజనీ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న బాలు చివరి పాట

చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్.. ఇలా ఒకరు కాదు.. చాలా మంది సూపర్ హీరోస్ వెనుక కామన్ గా ఓ గొంతు వుంది. అదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సుమారు నాలుగు దశాబ్దాలు బాలు పాట.. హీరోల ఆట అన్నట్టుగా సాగింది. ఇప్పుడు బాలు లేరు. కానీ ఆయన పాట వుంది. మామూలు కాదు.. ట్రెండింగ్ లో వుంది. అదీ రజనీ కొత్త సినిమా రూపంలో. శివ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అన్నాత్త’. నయనతార, కీర్తిసురేష్‌ హీరోయిన్స్. ఇమాన్‌ సంగీతం.

తాజాగా ఈ సినిమా సింగల్‌ ట్రాక్‌ విడుదలైంది. పాట పాడింది ఎస్పీబీ. ఇదే ఆయన రజనీ కోసం చివరిగా రికార్డ్ చేసిన పాట. ఈ పాట పై రజనీ ట్వీట్ చేశారు.‘‘నాలుగు దశాబ్దాలు పాటు ఎస్పీబీ నా స్వరంగా జీవించారు. నా కోసం పాడిన ఈ పాటే ఆయన ఆఖరి పాట అవుతుందని కలలో కూడా ఊహించలేదు’’అని రాసుకొచ్చారు. ఇక పాట విషయానికి పక్కా మాస్ బీట్ ఇది. ఎస్పీబీ చాలా హుషారుగా ఆలపించారు. రజనీ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ”ఎస్పీబీ సర్ వి మిస్ యూ.. సాంగ్ వీరలెవెల్” అని కామెంట్లు పెడుతున్నారు. ఎస్పీబీ పాడటం తగ్గించుకున్నా.. రజనీ కాంత్ కి మాత్రం ఖచ్చితంగా పాడేవారు. రజనీ రీసెంట్ సినిమాలు పేట, దర్బార్ లో బాలు పాడిన టైటిల్ ట్రాక్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ‘అన్నాత్త’ టైటిల్ ట్రాక్ కూడా అటు రజనీ ఫ్యాన్స్ కి ఇటు బాలు ఫ్యాన్స్ కి హుషారు ని పంచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close