కాళేశ్వరంపై మరో కమిటీ… జ్యుడిషియల్ కమిటీ నిర్ణయం..?

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను పాయింట్ టూ పాయింట్ గుర్తించే పనిలో పడింది జ్యుడిషియల్ కమిషన్. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి ఏమేం జరిగిందో స్టడీ చేసి ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ను రూపొందించాలని ఫిక్స్ అయింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు దారితీసిన పరిస్థితుల నుంచి అధ్యయనం మొదలు పెట్టాలని భావిస్తోంది.

బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చింది..? ప్రాణహితతో పోలిస్తే కాళేశ్వరం ఆవశ్యకత ఏంటి..? మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం..? అందుకు అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా..? ఏమైనా పొరపాట్లు జరిగాయా..? ఈ విషయాలను ముందుగా తేల్చాలని కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ అంశాల కోసం ఎక్స్ పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటుంది జ్యుడిషియల్ కమిషన్. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో కమిషన్ రెండుసార్లు భేటీ అయి చర్చలు జరిపింది. ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతోపాటు ఇరిగేషన్ శాఖ అధికారుల నివేదికను పరిశీలించి ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తోన్న అవకతకలపై కమిషన్ ఓ స్పష్టతకు రావొచ్చునని భావిస్తోంది.

ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులు, ఇంజినీర్లకు జ్యుడిషియల్ కమిషన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు సైతం నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వైట్ పేపర్ ను రిలీజ్ చేసి లోపాలపై ప్రభుత్వం వివరించడంతో వాటిని అధ్యయనం చేసి అధికారులను, ఇంజినీర్లను ప్రశ్నించనుంది కమిషన్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close