ల్యాండ్ ఇష్యూ… మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూపంచాయితీ హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి మాదంటే మాదేనని ఇద్దరూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అటు మల్లారెడ్డి చెప్తుండగా.. తమ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయని అడ్లూరి లక్ష్మణ్ చెబుతుండటంతో ఈ ఇష్యూ కాస్త సీఎం వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నెంబర్ 82కు సంబంధించి రెండున్నర ఎకరాల భూమిపై మల్లారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య వివాదం నెలకొంది. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి వర్గీయులు ఇటీవల కంచెను కూల్చడం ఘర్షణకు దారితీసింది. ఈ భూమిని పదిహేనేళ్ళ కిందటే కొనుగోలు చేసినట్లు మల్లారెడ్డి చెబుతున్నారు. తన దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజేనేమా చేస్తానని మల్లారెడ్డి సవాల్ విసరడంతో ఈ ఇష్యూ మరింత హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీ తమపై తప్పదు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఈ అంశంపై స్పందించిన అడ్లూరి లక్ష్మణ్.. తనతోపాటు ఆరుగురు కలిసి 2015లో ఈ భూమిన్ని కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్ పై వివాదం ఉండటంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడిని కలిసి సెటిల్ చేయాలని అడిగితే పట్టించుకోలేదన్నారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ కబుర్ల చెప్పడం కాదు.. ముఖ్యమంత్రి వద్ద తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసరడంతో మల్లారెడ్డి ఎలా వ్యవహరిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ల్యాండ్ ఇష్యూపై మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ భూమి మాదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా చెబుతుండటంతో రేవంత్ ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close