టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న మరో కొత్త పార్టీ..!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల హడావుడి ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నట్లుగా ఉన్నాయి. ఇప్పటికే షర్మిల రాజకీయ పార్టీ రావడం ఖాయమయింది. మరికొంత మంది కూడా పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నారని టీఆర్ఎస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్‌లో నిరాదరణకు గురవుతున్న ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌లోని కొంత మంది ముఖ్యులు ఈ పార్టీ పనిలో ఉన్నారని టీఆర్ఎస్ ముఖ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొందరు కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారని.. వేరే పార్టీలకు అవకాశం లేదని గంగుల చెబుతున్నారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని తేల్చేశారు.

టీఆర్ఎస్‌లో కొత్త పార్టీలపై ఎక్కువగా గంగుల కమలాకరే స్పందిస్తున్నారు. బహుశా ఆయనకు మాత్రమే హైకమాండ్ పర్మిషన్ ఇచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షర్మిల పార్టీపై ఇప్పటికే ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏ పార్టీ గురించి గంగుల కమలాకర్ మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్‌లో కొంత మంది కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని బయట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీన్ని బట్టి ఈటెల పార్టీపై టీఆర్ఎస్‌లోనూ క్లారిటీ ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో బంగారు తెలంగాణ బ్యాచ్ హవా నడుస్తోంది.

ఉద్యమ తెలంగాణ నేతలకు నిరాదరణ ఎదురవుతోంది. ఉద్యమం చేసి తెలంగాణ సాధించింది తాము అయితే.. ఫలాలు… బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్‌లో చేరిన వారు అనుభవిస్తున్నారని వారుభావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయం అంత సాఫీగా ఉండబోవడం లేదని… కొన్ని పార్టీలు తెరపైకి రావడం ఖాయమన్న ప్రచారం మంత్రి గంగుల కమలాకర్ మాటలతో మరింతగా ఊపందుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close