ఈ రెడ్డి ఎమ్మెల్యేపైనా వైసీపీ నేతలే కుట్ర చేస్తున్నారట !

వైసీపీలో కీలక నేతలు తమపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని అనుమానంతో బతికేస్తున్నారు. రోజుకొకరు చొప్పున మీడియా ముందుకు వస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ తరహా ఆరోపణలు చేసి గంటలు గడవక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. తనపై పెద్ద నేతే కుట్ర చేస్తున్నాడని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కోటంరెడ్డి.. పెద్ద నేత అని పేరు చెప్పలేదు కానీ..ఆ రేంజ్‌లోనే తన పార్టీ వాళ్లే తనను బ్యాడ్ చేస్తున్నారని అంటున్నారు.

తన ఇమేజ్ డ్యామేజీ చేయాలని, తనని బలహీన పరచాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని నిలువరించాలని తాను ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. అలాంటి వారు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, వారంతా సీజనల్ పొలిటీషియన్లేనని అన్నారు. అలాంటి సీజనల్ పొలిటీషియన్లకు తన నియోజకవర్గంతో ఏం పని అంటూ నిలదీశారు. వారి పేర్లు మాత్రం తాను ఇప్పుడు బయటపెట్టనని, ఇప్పటికే అధిష్టానానికి చెప్పానని, సమయం వచ్చినప్పుడు పేర్లు బయటపెడతానన్నారు. తనకు రెండు ఆప్షన్లే ఉన్నాయని.. మొదటిది హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం.. రెండోది తాను వారి నియోజకవర్గాల్లో వేలు పెట్టడమని చెబుతున్నారు.

అయితే కోటంరెడ్డి ఇటీవల పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు. సీజనల్ పొలిటీషియన్లలాగా తాను పార్టీలు మారనని చెప్పుకొచ్చారు. అయితే కోటంరెడ్డి బీజేపీ నుంచి వైసీపీకి వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close