రైతుల సమస్యల కంటే కేసులకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వాలు?

ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం ఏమి సాధించాలనుకొంటోందో తెలియదు కానీ దాని పని కొండను త్రవ్వి ఎలుకని పట్టుకొన్నట్లుంది. ఆ పనికోసం ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అందులో రూ.52లక్షలు తెలంగాణా ప్రభుత్వం తరపున ఈకేసు వాదిస్తున్న రాంమ్ జేత్మలానీ ఫీజుకే సమర్పించుకొంది. ఇంత ఖర్చు చేసినా ఈ కేసులో ఏమయినా ముందుకు వెళ్ళగలుగుతోందా? అంటే అనుమానమే. పోనీ దోషులకు శిక్ష పడుతుందా? అంటే అదీ అనుమానమే. అటువంటప్పుడు ఈ కేసుపై విలువయిన ప్రజాధనం ఎందుకు వృదా చేస్తోందో ఎవరికీ తెలియదు. తెరాస, తెదేపాల మధ్య నెలకొని ఉన్న రాజకీయ వైరాన్ని ప్రభుత్వాల వరకు ప్రాకించడమే ఒక తప్పు అనుకొంటే దాని కోసం మళ్ళీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం మరో పెద్ద తప్పు. ఒకవైపు తెలంగాణాలో రైతన్నలు కేవలం రెండు మూడు లక్షల అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, తెలంగాణా ప్రభుత్వం తన రాజకీయ కక్షల కోసం ప్రజాధనాన్ని ఈవిధంగా ఖర్చు చేయడం సమంజసమేనా? అని ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో తెదేపా ప్రభుత్వం కూడా పోటీ పడుతోంది. ఓటుకి నోటు కేసు నుండి తనను తాను రక్షించుకొనేందుకు అది కూడా లాయర్లకు భారీగానే ముట్టజెప్పుతోంది. పైగా ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వాన్ని నిలువరించేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టి దానిపై విచారణ, కోర్టు కేసుల కోసం చాలా విరివిగానే డబ్బు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్సలు బాగోలేదని తరచూ చెప్పే తెదేపా ప్రభుత్వం మరి ఈ కేసుల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడాన్ని ఎవరూ సమర్దించలేరు.

కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని మభ్య పెట్టుకోవడానికి లేదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే గత ఏడాదిన్నర కాలంలో 80మంది రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్నారని వైకాపా వాదిస్తోంది. మూడు నెలల క్రితం ఆ రైతు కుటుంబాలను పరామర్శించడానికి జగన్ బయలుదేరినప్పుడు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి నష్టపరిహారం పెంచుతూ ఒక జి.ఓ. జారీ చేయడం గమనిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని దృవీకరించినట్లే అయింది. రెండు రాష్ట్రాలలో రైతన్నలు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకొంటుంటే, ప్రభుత్వాలు ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల కోసం లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం జవాబుదారీతనం లేకపోవడం..బాధ్యతా రాహిత్యమేనని చెప్పక తప్పదు. వాటిని నిలదీయవలసిన ప్రతిపక్ష పార్టీలు శవరాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం చాలా శోచనీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close