అమరావతే ఫైనల్ – రైతులకు ఏపీ బీజేపీ భరోసా !

అమరావతిని కాదని మరో రాజధాని సాధ్యం కాదని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అమరావతిలో వారం రోజుల పాటు నిర్వహించిన మనం..మన అమరావతి పాదాయత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సహా ఏపీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యంగా రాజధాని కోసం గట్టిగా నిలబడిన సుజనా చౌదరి, కన్నా లక్ష్మినారాయణ వంటి వారు ఈ సభలో యాక్టివ్‌గా కనిపించారు.

వారంతా రాజధాని రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరస్థితుల్లోనూ రాజధాని మారదన్నారు. జగన్ చేసిన అతి పెద్ద తప్పు రాజధాని రైతులకు అన్యాయం చేయడమని ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారడం అభివృద్ధికి చేటని తెలియని సీఎం ఉండటం దురదృష్టకరమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మూడు రాజధానులను వైసీపీ వారూ వ్యతిరేకిస్తున్నారన్నారvf కేవలం స్టేజ్‌పైనే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

వారం రోజుల పాటు బీజేపీ నేతల పాదయాత్ర రాజధాని గ్రామాల గుండా సాగింది. అయితే ఈ పాదయాత్రలో సోము వీర్రాజు లీడ్ తీసుకోవడంతో రైతుల్లో అనుకున్నంత స్పందన కనిపించలేదు. పైగా విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీకి పాదయాత్ర మైలేజ్ రాకుండా పోయింది. అయితే కొంత మంది బీజేపీ నేతలు చేసిన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని సుజనా చౌదరి అమరావతి రైతుల్ని కోరారు. అయితే ముగింపుసభకు మాత్రం అమరావతికి మద్దతుగా నిలబడిన నేతల్ని తీసుకు రావడతో బీజేపీ సభలో కాస్త ఉత్సాహం కనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close