ఏపీ బీజేపీ కొత్త టీమ్ – వైసీపీ ముద్ర పోతుందా ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ఎన్నికల కోసం తన టీమ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకూ ఉన్న నలుగురు ప్రధానకార్యదర్శలను మార్చేసి కొత్త వారికి చాన్సిచ్చారు. నలుగురు ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపనచౌదరిని నియమించారు. అలాగే పదకొండు మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు, చందు సాంబశివరావు వంటి సీనియర్ నేతలకూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. పది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఇతర మోర్చాలకూ అధ్యక్షుల్ని నియమించారు. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన టీమ్ కావడంతో..చాలా మంది నేతలు కీలక పదవుల కోసం పోటీ పడ్డారు. అయితే ప్రధాన కార్యదర్శులందర్నీ మార్చడం ద్వారా వైసీపీ ముద్రను తొలగించాలని పురందేశ్వరి ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కమిటీ ద్వారా సందేశం పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ప్రాధాన్యత తగ్గించడం ద్వారా.. తాము ఏ పార్టీకి అనుకూలం కాదన్న వాదనను వినిపించడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. చివరికి గత అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్ర లేకుండా నియమించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోము వీర్రాజు బృందం ఉన్నప్పుడు .. వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఏపీ బీజేపీలో జనంలో పలుకుబడి ఉన్న నేతలు తక్కువే అయినా వర్గపోరాటానికి మాత్రం కొదవ ఉండదు. పురందేశ్వరి టీమ్‌తో చాలా మంది సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close