ఏపీ బీజేపీ కొత్త టీమ్ – వైసీపీ ముద్ర పోతుందా ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ఎన్నికల కోసం తన టీమ్ ను ప్రకటించారు. ఇప్పటి వరకూ ఉన్న నలుగురు ప్రధానకార్యదర్శలను మార్చేసి కొత్త వారికి చాన్సిచ్చారు. నలుగురు ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపనచౌదరిని నియమించారు. అలాగే పదకొండు మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు, చందు సాంబశివరావు వంటి సీనియర్ నేతలకూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. పది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఇతర మోర్చాలకూ అధ్యక్షుల్ని నియమించారు. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన టీమ్ కావడంతో..చాలా మంది నేతలు కీలక పదవుల కోసం పోటీ పడ్డారు. అయితే ప్రధాన కార్యదర్శులందర్నీ మార్చడం ద్వారా వైసీపీ ముద్రను తొలగించాలని పురందేశ్వరి ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కమిటీ ద్వారా సందేశం పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ప్రాధాన్యత తగ్గించడం ద్వారా.. తాము ఏ పార్టీకి అనుకూలం కాదన్న వాదనను వినిపించడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. చివరికి గత అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్ర లేకుండా నియమించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోము వీర్రాజు బృందం ఉన్నప్పుడు .. వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఏపీ బీజేపీలో జనంలో పలుకుబడి ఉన్న నేతలు తక్కువే అయినా వర్గపోరాటానికి మాత్రం కొదవ ఉండదు. పురందేశ్వరి టీమ్‌తో చాలా మంది సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close