ప్రధాని మోడీతో చంద్రబాబు కీలక సమావేశం నేడే

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇతర హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయి. కనుక ఇవే విషయాలపై చర్చించేందుకు ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడీ ఆ రాష్ట్రానికి రూ.1.25 లక్షల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రాష్ట్రంలో మౌలికవసతుల అభివృద్ధి కోసం మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కనుక రాష్ట్ర విభజనతో పూర్తిగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో బాటు బీహార్ కి ప్రకటించిన ప్యాకేజి కంటే మంచి ఆర్ధిక ప్యాకేజి కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరబోతున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వదలచుకొన్న ఆర్ధిక ప్యాకేజిని కేంద్రప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. నేడు దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు కేంద్రప్రభుత్వం స్పశాతమయిన సంకేతాలు ఇస్తోంది. కారణాలు ఏవయినప్పటికీ ప్రత్యేక హోదా హామీని మోడీ ప్రభుత్వం అమలుచేయకపోతే దాని వలన రాష్ట్రంలో బీజేపీకి దానికి మిత్రపక్షంగా ఉన్నతెదేపాకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో సమావేశం ముగుసిన తరువాత వరుసగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పరికర, వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులతో సమావేశాలు అవుతారు. ఆయన తిరిగి బుదవారం విజయవాడకు చేరుకొంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close