కొలికపూడిపై కేసు – అసలు ఏపీసీఐడీకి సంబంధం ఏంటి ?

అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావును అరెస్టు చేసేందుకు ఏపీసీఐడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసులు ఇచ్చారు. సాధారణంగా సీఐడీ అంటే.. ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేస్తుంది. ప్రతి చిన్నదానికి కేసుులు నమోదు చేసే అధికారం ఉండదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు తమ పరిధిలో జరిగి నేరాలపై కేసులు నమోదు చేస్తాయి.

అయితే ఈ కేసులో సీఐడీ ఎలా కేసు నమోదు చేసిందన్నది సగటు పౌరుడికి వచ్చిన సందేహం. కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంటారు. రామ్ గోపాల్ వర్మ కూడా హైదరాబాద్ నివాసి. కానీ ఆయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా అమరావతికి వెళ్లి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేయాలంటే.. నేర పరిధి అనేది ఉంటుంది. ఈ కేసు పరిధి అంతా హైదరాబాద్ లోనే ఉంది. సీఐడీ అధికారుల తీరు ఇలాగే ఉంది. మార్గదర్శి ఇష్యూలో ఎవరో యూరిరెడ్డిని ఢిల్లీ నుంచి తెచ్చి తమ దగ్గర ఫిర్యాదు తీసుకున్నారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. ఇటీవలే యశశ్వి అనే ఎన్నారై విదేశాల నుంచి వస్తే.. అదుపులోకి తీసుకుని .. విజయవాడ తీసుకెళ్లి41ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. నోటీసులు ఇవ్వడనికి ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నదానిపై సీఐడీ నుంచి సమాధానం రాలేదు.

సీఐడీని దాని అధికార పరిధిని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల వేటకు వినియోగిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. కొలికపూడి విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి వేరే రాష్ట్రం కేసును తమ రాష్ట్రంలో నమోదు చేయాలనుకోవడంలోనే అధికార పరిధి ఉల్లంఘించారు. కోర్టు హెచ్చరించినా రాజకీయ బాసుల ఆదేశాలకే తలొగ్గుతున్నారు. వ్యక్తుల స్వేచ్చను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close