నన్ను విమర్శించడం తెరాసకి అలవాటుగా మారిపోయింది: చంద్రబాబు

తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చాలా రోజుల తరువాత వారి గురించి నిన్న మాట్లాడారు. తెలంగాణా తెదేపా నేతలతో సమావేశమయినప్పుడు తెలంగాణాలో ఏవిధంగా ముందుకు సాగాలనే దానిపై ఆయన వారికి కొన్నిసూచనలు చేశారు.

“తెలంగాణా ప్రభుత్వం నేటికీ నామీద నిందలు వేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సమస్యని చూపి నన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడితేనే ప్రజలపై తన పట్టు నిలుపుకోవచ్చని తెరాస భావిస్తోంది. ఆ ప్రయత్నంలోనే తెలంగాణా ప్రాజెక్టులకి నేను అడ్డు తగులుతున్నానని నన్ను నిందిస్తోంది. కానీ నేను ఎప్పుడూ దేనినీ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. తెలంగాణాలో ప్రాజెక్టులు, నదీ జలాల పంపకాలు విభజన చట్ట ప్రకారమే జరగాలని కోరుతున్నాను. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళమని చెప్పడం తప్పు కాదు కదా? నాకు ఆంధ్రా ఎంతో తెలంగాణా కూడా అంతే. రెండు తెలుగు రాష్ట్రాలు సరిసమానంగా అభివృద్ధి చెందాలని కోరుకొంటాను. తెలంగాణా ప్రభుత్వానికి ప్రాజెక్టుల విషయంలో స్పష్టత లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. వాటి నుంచి తప్పించుకోవడానికే నాపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలని మభ్యపెడుతోంది. ఇదే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పవలసి ఉంది,” అని తెలంగాణా తెదేపా నేతలకి బాబు చెప్పారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా రాష్ట్రం, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. ప్రతిపక్షాలన్నిటినీ నిర్వీర్యం చేసి రాష్ట్రంలో తెరాసకి ఎదురేలేకుండా చేసుకొన్నారు. ప్రతిపక్షాలలో మిగిలిన కొద్ది మంది నేతలు ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని ఆయన పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగానే నిర్ణయాలు తీసుకొంటూ పరిపాలన సాగిస్తున్నారు. అయినప్పటికీ, అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూనే ఉంటారు.

ఎవరూ తమ ప్రాజెక్టులని ఆపలేరని అంటారు మళ్ళీ అంతలోనే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తుంటారు. తెలంగాణాలో తెరాసకి సవాలు విసురుతున్న తెదేపాని దాదాపు తుడిచిపెట్టేసిన తరువాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం గమనిస్తే ఇంకా కెసిఆర్ అభద్రతాభావంతో బాధపడుతున్నట్లే ఉన్నట్లు అర్ధం అవుతోంది. తెలంగాణా ప్రాజెక్టులని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరని కెసిఆర్ నమ్ముతున్నప్పుడు ఆయనపై విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నారు? అంటే చంద్రబాబు చెప్పిన కారణమే.

రాష్ట్ర విభజన తరువాత కెసిఆర్ కి వడ్డించిన విస్తరి వంటి తెలంగాణా రాష్ట్రం దక్కితే, చంద్రబాబుకి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేపట్టారు. కనుక చంద్రబాబే అటువంటి అభద్రతాభావంతో బాధపడుతూ ఉండాలి. కానీ ఎన్ని సమస్యలున్నా ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంటే, అన్నీ ఉన్న కెసిఆర్ మాత్రం ఇంకా అభద్రతాభావంతో బాధపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close