ఇంతకూ మోదీ నుంచి వచ్చిన సానుకూలత ఏ అంశాలపై !?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. జగన్ అలా ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లే సమయంలోనే .. మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లుగా సమాచారం బయటకు వచ్చింది, దీంతో నరేంద్రమోదీ ఏ మూడ్‌లో ఉన్నారో కానీ దాదాపుగా అరగంట సేపు సమావేశం జరిగిందని.. తమ విజ్ఞాపనలన్నీ మోదీ విన్నారని.. సానుకూలంగా స్పందించారని.. అటు సీఎం జగన్ తో పాటు ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.

మరో వైపు మీడియాకు మాత్రం ఎప్పుడూ ఇచ్చే ప్రెస్ నోట్ నే కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. అందులో ప్రత్యేకహోదా దగ్గర్నుంచి అన్ని హామీలు అమలు చేయాలని అడిగినట్లుగా ఉంది. నాలుగేళ్ల నుంచి అవే అడుగుతున్నారు.కానీ కేంద్రం పైసా సాయం చేయడం లేదు. ఈ సారి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారన్నారు కానీ.. అసలు లోపల ఏ అంశాలపై అడిగారు.. ఏం చెప్పారు అన్నది మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. మోదీతో భేటీ తర్వాత జగన్..కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు. రుషికొండ తవ్వకాలపై కమిటీని ఆ మంత్రిత్వ శాఖనే వేయనుంది. దీంతో ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ సర్కార్ ఓడీలోనే ఉందని.. సామాజిక పెన్షన్లు మంజూరు చేయడానికి కూడా నిధులకు కటకటగా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ఆమెను కలిసే అవకాశం లేదు. అమిత్ షాను రాత్రి పదిగంటల తర్వాత కలవనున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పట్లాగే.. అంతుబట్టకుండా సాగుతోంది. అందులో రాష్ట్ర అంశాలు ఉన్నాయో.. లేవో మాత్రం క్లారిటీ లేదు. కానీ సానుకూలత అంటూ.. ప్రచారం మాత్రం ప్రారంభించారు. అయితే జగన్ ఢిల్లీ భేటీపై మీడియాలోనూ పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం అసలు విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close