ఇంతకూ మోదీ నుంచి వచ్చిన సానుకూలత ఏ అంశాలపై !?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. జగన్ అలా ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లే సమయంలోనే .. మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లుగా సమాచారం బయటకు వచ్చింది, దీంతో నరేంద్రమోదీ ఏ మూడ్‌లో ఉన్నారో కానీ దాదాపుగా అరగంట సేపు సమావేశం జరిగిందని.. తమ విజ్ఞాపనలన్నీ మోదీ విన్నారని.. సానుకూలంగా స్పందించారని.. అటు సీఎం జగన్ తో పాటు ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.

మరో వైపు మీడియాకు మాత్రం ఎప్పుడూ ఇచ్చే ప్రెస్ నోట్ నే కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. అందులో ప్రత్యేకహోదా దగ్గర్నుంచి అన్ని హామీలు అమలు చేయాలని అడిగినట్లుగా ఉంది. నాలుగేళ్ల నుంచి అవే అడుగుతున్నారు.కానీ కేంద్రం పైసా సాయం చేయడం లేదు. ఈ సారి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారన్నారు కానీ.. అసలు లోపల ఏ అంశాలపై అడిగారు.. ఏం చెప్పారు అన్నది మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. మోదీతో భేటీ తర్వాత జగన్..కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు. రుషికొండ తవ్వకాలపై కమిటీని ఆ మంత్రిత్వ శాఖనే వేయనుంది. దీంతో ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ సర్కార్ ఓడీలోనే ఉందని.. సామాజిక పెన్షన్లు మంజూరు చేయడానికి కూడా నిధులకు కటకటగా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ఆమెను కలిసే అవకాశం లేదు. అమిత్ షాను రాత్రి పదిగంటల తర్వాత కలవనున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పట్లాగే.. అంతుబట్టకుండా సాగుతోంది. అందులో రాష్ట్ర అంశాలు ఉన్నాయో.. లేవో మాత్రం క్లారిటీ లేదు. కానీ సానుకూలత అంటూ.. ప్రచారం మాత్రం ప్రారంభించారు. అయితే జగన్ ఢిల్లీ భేటీపై మీడియాలోనూ పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం అసలు విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close