వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో అయినా వేస్తాం కానీ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వృద్ధుల్ని తిప్ప వద్దని.. అయితే బ్యాంక్ కౌంట్లలో లేకపోతే ఇంటి దగ్గర ఇవ్వాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో చేసిన రాజకీయ డ్రామా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరికలు రావడంతో అధికారులు రూటు మార్చారు.

ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా వృద్ధుల పెన్షన్ ను ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. మిగిలిన పాతిక శాతం మందికి ఇంటికి వెళ్లి ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్లు లేకపోయినా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో కార్యాలయంలో పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో నాలుగైదు వందల మంది పెన్షనర్లు ఉంటారు. వారికి ఒక్క రోజులో పంపిణీ చేయడం పెద్ద విషయం కాదు.

కానీ వాలంటీర్లు లేకపోతే అలా ఇవ్వలేరని చెప్పడానికి వైసీపీతో కుమ్మక్కయిన నేతలు ఇలా.. ఏదో ఓ కారణాన్ని వెదుక్కుంటున్నారు. వృద్ధులకు బ్యాంకుల్లో జమ చేసిన వారు బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలి. దాని కోసమైనా తిరగాలి. ఎండల్లో వృద్ధులను ఇలా తిప్పేందుకు … అధికారులు ఎందుకు ఇంత డెస్పరేట్ గా ఉన్నారో కానీ.. ఆ వృద్ధుల సమస్యలను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close