వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో అయినా వేస్తాం కానీ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వృద్ధుల్ని తిప్ప వద్దని.. అయితే బ్యాంక్ కౌంట్లలో లేకపోతే ఇంటి దగ్గర ఇవ్వాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో చేసిన రాజకీయ డ్రామా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరికలు రావడంతో అధికారులు రూటు మార్చారు.

ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా వృద్ధుల పెన్షన్ ను ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. మిగిలిన పాతిక శాతం మందికి ఇంటికి వెళ్లి ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్లు లేకపోయినా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో కార్యాలయంలో పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో నాలుగైదు వందల మంది పెన్షనర్లు ఉంటారు. వారికి ఒక్క రోజులో పంపిణీ చేయడం పెద్ద విషయం కాదు.

కానీ వాలంటీర్లు లేకపోతే అలా ఇవ్వలేరని చెప్పడానికి వైసీపీతో కుమ్మక్కయిన నేతలు ఇలా.. ఏదో ఓ కారణాన్ని వెదుక్కుంటున్నారు. వృద్ధులకు బ్యాంకుల్లో జమ చేసిన వారు బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలి. దాని కోసమైనా తిరగాలి. ఎండల్లో వృద్ధులను ఇలా తిప్పేందుకు … అధికారులు ఎందుకు ఇంత డెస్పరేట్ గా ఉన్నారో కానీ.. ఆ వృద్ధుల సమస్యలను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close