పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లిస్తారు. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.

అయితే ఆరు నెలల తేడాతో డీఎలు అమలు చేయడంతో.. ఆ తర్వాత ఇవ్వాల్సిన డీఎలను వాయిదా వేస్తారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఏర్పడుతోంది. ఇవ్వాల్సిన డీఎలను ఇలా.. ఆరు నెలలకోసారి ఇస్తామని చెప్పడం ద్వారా.. కొత్తగా ఇవ్వాల్సిన డీఏలకు టెండర్ పెట్టేశారని విమర్శలు వినిపిస్తన్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకే సారి అమలు చేస్తారని చాలా మంది ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఎప్పట్లాగే కొత్తగా ఆలోచించింది.

కరోనా పేరుతో కత్తిరించిన జీతాలను కూడా ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించింది. రెండు నెలల పాటు సగం సగం జీత కోత విధించిన దాన్ని ఐదు విడుతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ నుంచే వాయిదా జీతాలు చెల్లిస్తామని ప్రకటించించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ జీతం చెల్లిస్తారు. డీఏలను 2022 వరకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు జీతాలను ఐదు నెలల పాటు ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close