కాపు కార్పోరేషన్ కి 2,000 కోట్లు కేటాయించనున్న ఏపి ప్రభుత్వం?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవ్వాళ్ళ విజయవాడలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన ఉద్యమం, దాని పర్యవసానాలపై చర్చ ప్రధాన అజెండాగా ఉండవచ్చును. ఆయనను, వైకాపాను ధీటుగా ఎదుర్కోవడంలో పార్టీ నేతల వైఫల్యంపై ముఖ్యమంత్రి తన మంత్రులకు క్లాసు తీసుకొనే అవకాశం ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరిగిపోతునందున, దాని కోసం వేసిన జస్టిస్ మంజునాధ కమీషన్ గడువును తొమ్మిది నెలల నుండి ఆరు లేదా మూడు నెలలకు కుదించడం, దాని విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించవచ్చును. కాపులకు ఏటా వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్ళలో మొత్తం ఐదువేల కోట్లు ఇస్తామని తెదేపా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినందున, ప్రతిపక్షాలు, కాపు నేతలు కూడా ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోమని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కనుక 2015,2016 సం.లకు కలిపి మొత్తం రెండు వేల కోట్లు కాపు కార్పోరేషన్ కి కేటాయించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆవిధంగా చేసినట్లయితే ముద్రగడ పద్మనాభం ఉద్యమం పాక్షికంగా విజయవంతం అయినట్లే భావించవచ్చును. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ క్రెడి తనదేనని చెప్పుకోవచ్చును. వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్, ఇతర అంశాల గురించి ఈరోజు జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close