చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓట్లు వేయలేదు!

గ్రేటర్ ఎన్నికల కోసం ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తమ తమ పార్టీల తరపున చాలా జోరుగా ప్రచారం చేసారు. కానీ నిన్న జరిగిన పోలింగులో వారిద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. హైదరాబాద్ ఓటర్ల జాబితాలో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి పేర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన ముగ్గురూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఆయన ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఓటరు చిరునామాని స్వగ్రామమయిన చిత్తూరులోని నారావారిపల్లెకు మార్పించుకొన్నారని అందుకే ఆయన ఓటు వేయలేదని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటుని తన స్వగ్రామమయిన చింతమడకలోనే ఉంచుకొన్నందున ఆయనకి గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉండదు. కనుక ఓటు వేయలేదు. ఆయన కుమారుడు కె.టి.ఆర్.కి హైదరాబాదులో ఓటరుగా ఉన్నందున ఆయన తన ఓటు హక్కుని వినియోగించుకొన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుని ఘటనలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం కేరళలో జరుగుతున్న తన సినిమా షూటింగ్ మధ్యలో ఆపుకొని మొన్న హైదరాబాద్ వచ్చేరు. కానీ ఓటు వేయకుండానే కేరళ తిరిగి వెళ్ళిపోయారు. ఆయన రాజకీయాలలో లేకపోయుంటే ఆయన ఓటు వేసినా వేయకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కారు కానీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉంటూ ఓటు వేయకపోవడం వలన విమర్శింపబడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close