జగన్ కేసుల ఉపసంహరణలో మాత్రం వెనక్కి తగ్గరా !?

వైసీపీ వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు హత్య కేసుల్లో ఉన్నా సరే ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలిచ్చింది. ఇలా ఉపసంహరించడం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో చివరికి ప్రభుత్వం కూడా నిజం తెలుసుకుని జీవోలను ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టుకు తెలిపింది. అయితే ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు తెలిపిన జీవోల్లో ముఖ్యమంత్రి జగన్ కేసుల జీవోలు లేవు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అనేక మార్లు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం సహా.. ఇతర కేసులు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత వాటిలో పదకొండు కేసుల్ని ఏకపక్షంగా ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. పదకొండు కేసుల్లో జగన్ కూడా నిందితునిగా ఉన్నారు. కేసుల ఉపసంహరణ తర్వాత… ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను.. చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించింది.

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసులపై హత్యాయత్నం చేసిన కేసుల దగ్గర్నుంచి .. హత్య కేసుల్లో నిందితుల వరకూ.. కొన్ని వందల కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటన్నింటి ఉపసంహరణ జీవోలు .. రద్దు చేయక తప్పదు. అయితే కొన్ని జీవోలను ఉపసంహరించుకుంటున్న చెబుతున్న ఏపీ సర్కార్.. జగన్ కేసుల గురించి చెప్పకపోవడం … చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close