ఇక అమరావతి భూముల వేలం !

అమరావతి ఒక్క ఇటుక వేయలేదు. ఒక్క రూపాయి పని చేయలేదు. నిరంతరాయంగా జరుగుతున్న పనుల్ని నిలిపివేశారు. అమరావతిని శ్మశానం అన్నారు. అది మునిగిపోతుందన్నారు. రైతుల్ని ఇష్టం వచ్చినట్లుగా వేధించారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చివరికి అమరావతి భూముల్ని అమ్మి వేల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు భూముల్ని ఎకరాకు రూ. పది కోట్ల చొప్పున అమ్మేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

తొలి ఏడాది దాదాపుగా 250 ఎకరాలు అమ్మి 2500 కోట్లు సేకరిస్తారట. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలకు చెందిన భూములు. మెడ్ సిటీ, లండన్ కింగ్స్ కాలేజీ వంటి అంతర్జాతీయ సంస్థలు మెడికల్ కాలేజీలు నెలకొల్పడానికి భూములు కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఒప్పదాలను పట్టించుకోలేదు. కనీసం ఫాలో అప్ కూడా చేయలేదు. అంతే కాదు అన్నీ ఒప్పందాలను రద్దు చేశారు. ఇప్పుడు వారు సంస్థలు పెట్టడానికి ముందుకురాలేదని.. ఆ భూములు వేలం వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఒక్క సారి కాదు వరుసగా ప్రతీ ఏడాది భూములమ్ముతామని ప్రభుత్వం చెబుతోంది.

అమరావతిని అభిృద్ధి చేస్తే.. ప్రభుత్వానికి ఉన్న మిగులు భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల వరకూ ఆదాయం వస్తుందని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. అమరావతిని అభివృద్ధి చేయకపోగా.. అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా వేధించాలో వేధించి.. చివరికి వారికి కౌలు కూడా చెల్లించకుండా.. కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ వారి భూముల్ని మాత్రం అడ్డగోలుగా అమ్ముకుని సొమ్ములు సాధించుకోవాలనుకుంటోంది. కానీ ప్రభుత్వం సీఆర్డీఏ ఒప్పందాల్ని ఎప్పుడో ఉల్లంఘించి.. భూములు అమ్ముతామంటే రైతులు ఊరుంటారా..? కోర్టుకెళ్లరా. అనే సందేహం సహజంగానే వస్తుంది.

రైతులు న్యాయపోరాటం చేసినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నైతికంగా దిగజారిపోయినందునే అమరావతి భూముల్ని అమ్ముకునేందుకు సిద్ధపడిందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. అయితే ఇలాంటివాటిని ప్రభుత్వం ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close