రంగ‌మార్తాండ‌కు మోక్షం

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రంగ‌మార్తాండ‌. ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ ముఖ్య‌పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి మ‌రాఠీలోని `న‌ట‌సామ్రాట్‌` మాతృక‌. చాలాకాంగా ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. చివ‌ర్లో బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. ఓ ప‌ది శాతం షూటింగ్ ఉంద‌న‌గా, డ‌బ్బులు లేక‌పోవ‌డంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత కూడా డ‌బ్బులు స‌ర్ద‌లేక చేతులు ఎత్తేశాడు. కాక‌పోతే… ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ కావ‌డం, ఈ సినిమాపై బ‌య‌ట పాజిటీవ్ బ‌జ్ న‌డ‌వ‌డంతో `రంగ‌మార్తాండ‌` ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా… అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు `రంగ‌మార్తాండ‌`కు మోక్షం ల‌భించింది. నిర్మాత‌కు డ‌బ్బులు స‌ర్దుబాటు అవ్వ‌డంతో.. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయ‌డానికి స‌మాయాత్తం అయ్యారు. మ‌రో ప‌ది రోజుల్లో రంగ‌మార్తండ షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఆగ‌స్టు లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చినా, ఈ సినిమాని నేరుగా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌న్న‌ది కృష్ణ‌వంశీ ఆలోచ‌న‌. చివ‌ర్లో నిర్ణ‌యం మారితే త‌ప్ప‌.. ఈ సినిమా థియేట‌ర్లో విడుద‌ల చేయ‌డం త‌థ్యం. చాలా కాలంగా కృష్ణ‌వంశీ త‌న‌దైన మార్క్ సినిమాని అందివ్వ‌డంలో విఫ‌లం అవుతూనే ఉన్నారు. మ‌రి ఈసారైనా ఆయ‌న అభిమానుల్ని అల‌రిస్తారో, లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close