టీచర్లు ఆస్తులు ప్రకటించాలట – మిగతా వాళ్లెందుకు వద్దు !?

తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తులను ప్రకటించి .. వాటిపై ఆమోదముద్ర ఉన్నతాధికారుల నుంచి వేయించుకోవాలిట. లేకపోతే అక్రమాస్తులుగా గుర్తిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఓ ఉపాధ్యాయుడు ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. విచారణ చేశారు. నిజంగానే టీచర్ గా ఉద్యోగ విధుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యాపారాలు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు కూడా బెట్టాడు. దీంతో విద్యాశాఖకు కోపం వచ్చింది. వెంటనే ఆస్తుల ప్రకటన నిర్ణయం తీసుకుంది.

ఒక్క టీచర్ అలా చేశారని అందరూ అలా చేస్తారా అనే డౌట్ మిగతా వాళ్లకు వస్తుంది. అయితే చాలా మంది టీచర్లు అదే పని చేస్తున్నారని సరిగ్గా పాఠాలు చెప్పడం లేదన్న ఫీడ్ బ్యాక్ అన్ని చోట్లా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీచర్లు ఉద్యోగ విధులను మాత్రమే నిర్లక్ష్యం చేస్తారు.. కానీ అవినీతికి పాల్పడరు. పాల్పడే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. వ్యాపారాలు చేస్తారు.. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే విద్యాశాఖ ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ.. ఉద్యోగాన్ని లంచాల మయంగా చేసేశారు. రెవిన్యూ వంటి కీలక శాఖల్లో అటెండర్ ఇంట్లో సోదాలు జరిపిన కోట్ల ఆస్తులు కనిపిస్తూంటాయి. ఆర్థిక వ్యవహారాలు.. ప్రజా సేవలు ఎక్కువగా జరిగే శాఖల్లో యితే ఈ లంచాల పర్వం ఎక్కువ. మరి టీచర్లపై వచ్చినంత కోపం ఈ అధికారులపై ఎందుకు రాదనేది అర్థం కాని విషయం. ఒక్క విద్యాశాఖ ఉద్యోగులు ఎందుకు అందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇదే చేయిస్తే.. లంచం సమస్య పరిష్కారనికి ఓ ప్రయత్నం చేసినట్లుగా ఉంటుది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close