డ్వాక్రా మహిళల “పెన్షన్ బీమా” సొమ్ములు కూడా విత్ డ్రా !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది. మొత్తం ఎల్‌ఐసీకి కడతారు. ఎల్ఐసీ 60వ సంవత్సరం నుంచి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్‌ ఇస్తోంది. ప్రీమియం చెల్లించే సమయంలో సభ్యురాలు మరణిస్తే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. బీమాతో పాటు, ఫించను కూడా లభించే ఈ పథకాన్ని ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆపేసింది.

అటు డ్వాక్రా మహిళలు.. ఇటు ప్రభుత్వం కలిపి కట్టిన మొత్తం ఎల్‌ఐసీ వద్ద కార్పస్‌ ఫండ్‌గా ఉన్న రూ. 2,118 కోట్లను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. దీంతో పథకం ఆపేస్తున్నట్లుగా ఎల్‌ఐసీ పేపర్ ప్రకటన జారీ చేసింది. తమకు సంబంధం లేదని … క్లెయిమ్‌ల కోసం తమ వద్దకు రావొద్దని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం నాలుగు లక్షల మందికిపైగా పింఛన్‌ ఇస్తున్నారు. ఇవన్నీ ఆగిపోనున్నాయి. అయితే ఇప్పుడు కార్పస్ ఫండ్ నిధులు ప్రభుత్వానికి కావు. డ్వాక్రా మహిళలవి. ఇప్పుడు ప్రభుత్వం డ్రా చేసుకున్న నిధులు డ్వాక్రా మహిళలకు ఇస్తారా లేక సొంతానికి వాడుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకం.

ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆర్డినెన్స్, జీవోలను రహస్యంగా ఉంచింది. దీంతో ఎల్‌ఐసీ ప్రకటిస్తే తప్ప స్పష్టత లేదు. అయితే అభయ హస్తం పథకం కొనసాగుతుందని..సెర్ఫ్‌ ద్వారా బీమా క్లెయిమ్‌లను పరిష్కరిస్తామని చెబుతున్నారు. కానీ గతంలో చంద్రన్న బీమాను రద్దు చేసి తీసుకొచ్చిన వైఎస్ఆర్ బీమా తరహాలోనే ఇస్తామన్న ప్రకటనలకే పరిమితమవుతారు కాకనీ ఇవ్వరని డ్వాక్రా మహిళలు అనుమానంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close