వివేకా హత్య కేసు .. ఇప్పుడు సీబీఐపైనే ఆరోపణలు !

వివేకా హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత మెల్లగా అయినా విచారణ నిందితుల వద్దకు చేరుతున్న సమయంలో కొత్త కొత్త క్యారెక్టర్లకు బయటకు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా అంతా ఇద్దరు, ముగ్గురు వైఎస్ వివేకా అల్లుడే చేయించాడని.. వివేకా స్త్రీ లోలుడని ప్రచారం చేయడానికి వెనుకాడని వ్యక్తులు తాజాగా సీబీఐ మీద గురిపెట్టారు. కల్లూరు గంగాధర్ రెడ్డి అనే యువకుడు కొత్తగా అనంతపురం ఎస్పీని కలిసి నేరుగా సీబీఐ అధికారుల మీద ఫిర్యాదు చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యాం చెప్పాలంటూ సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. తనకు సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఆఫర్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అంతే కాదు తానే చంపానని ఒప్పుకోవాలని కూడా ఒత్తిడి చేశారని అంటున్నారు. ఓ సమగ్రమైన లేఖను తీసుకుని ఆయన ఎస్పీని కలిశారు. తర్వాత ఓ వర్గం మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. గంగాధర్ రెడ్డి చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

కడప ఎస్పీని కాకుండా అనంతపురం ఎస్పీని కల్లూరు గగాంగధర్ రెడ్డి కలవడం.. అంతా ఓ ప్లాన్ ప్రకారం చెబుతున్నట్లుగా మీడియాకు చెబుతూండటం ఆసక్తి రేపుతోంది. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని కొంతమంది అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కల్లూరు గంగాధర్ రెడ్డి ఎవరు.. ఏమిటి అన్నదానిపై వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close