రోడ్లు, డాక్టర్లు .. డెడ్ లైన్లు – ప్రకటనలే పాలన !

ఏపీ సీఎం జగన్ అధికారులతో చేసే సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఎడిటింగ్ చేసిన వీడియోలు విడుదల చేస్తారు. ఓ ప్రెస్ నోట్ మాత్రం వస్తుంది. అ ప్రెస్‌నోట్‌లో ఏ శాఖకు చెందినదయితే.. అది గత మూడేళ్ల కిందట ఏముందో..అందులో కొంచెం కొంచె మార్పులతో ఇప్పటికీ ఇస్తూంటారు. అలా చేస్తాం.. ఇలా చేస్తాం… సీఎం ఆదేశించారని చెబుతూంటారు కానీ.. ఒక్క పనీ ముందుకు సాగదు. తాజాగా ఫ్యామిలీ డాక్టర్లంటూ హడావుడి చేసి .. ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని జగన్ పదే పదే చెప్పారు. చివరికి ఆగస్టు పదిహేను వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు.

సీఎం మాటనే పట్టించుకోరా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజానికి సమీక్షలో అలా చెబుతారు కానీ.. దానికి తగ్గట్లు చర్యలను ఎవరూ పట్టించుకోరు. రకరకాల అడ్డంకులు వస్తాయి. అందరూ లైట్ తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా అంతే. టీడీపీ హయాంలో .. గ్రామాల్లో సేవలందించడానికి మొబైల్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. వాటిని మరింత విస్తృత పరిచి .. కేంద్రం ఇస్తున్న నిధులతో హెల్త్ క్లీనిక్‌లు నిర్మించి .. అందులో వైద్యులను నియమించాలనుకున్నారు. కానీ ఆ పనులేమీ చేయలేదు. సీఎం డెడ్ లైన్ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు మళ్లీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామనే మాటలు చెబుతున్నారు.

ఈ ఒక్క విషయం మాత్రమే కాదు… ప్రతి విషయంలోనూ అదే తంతు. రోడ్ల గురించి జూలై పదిహేను డెడ్ లైన్ పెట్టారు. కానీ సీఎం చెప్పిన మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని అధికారులు మిన్నకుండిపోయారు. సీఎం కూడా అడగలేదు. అడిగితే.. నిధులేవీ అంటారు మరి. పాలన కేవలం.. ప్రకటనల కోసమే అన్నట్లుగా సాగుతోందని… అసలు మాటలకు.. చేతలకు పొంతనే ఉండదని అధికార వర్గాలు కూడా గుసగులాడుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో, హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close