దాడి చేయడానికి వచ్చిన వాళ్లను కదా అరెస్ట్ చేయాల్సింది..?: హైకోర్టు

ముందస్తు అరెస్ట్ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వారిని కానీ.. పర్యటనకు పర్మిషన్ తీసుకున్న వారిని ఎలా అరెస్ట్ చేశారని.. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌.. ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా .. చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత.. 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా.. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నోరు విప్పలేకపోయారు.

ఆందోళనలు చేస్తామని చెప్పిన వారిని ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించింది. 151 సీఆర్పీసీ నోటీసు చంద్రబాబుకు ఇవ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్థులు, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే..151 సీఆర్పీసీ నోటీసు ఇస్తారు కదా.. అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతకు ఎందుకు షరతులు విధిస్తున్నారని.. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం ఏంటని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై.. మార్చి రెండో తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.

హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించలేకపోయారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై… హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటూ… దాదాపుగా ప్రతీ కేసులోనూ.. విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపైనా.. అదే తరహా విమర్శలు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ రోజూ.. ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close