జేసీపై కేసు: మీసం మెలేసినందుకూ పెడతారా..!?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభారక్ రెడ్డిపై మీసం మెలేశారంటూ పోలీసులు కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసులు పెట్టేశారు. 153A, 506 సెక్షన్ల కింద కేసు పెట్టి.. మీసం మెలేసి..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనంతటికి కారణం.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో. ఆ వీడియోలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేస్తే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సవాల్ చేస్తున్నట్లుగా ఉంది. దాన్ని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. దాంతో వైరు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

మున్సిపాల్టీల్లో రెండో వైస్ చైర్మన్‌ని ఎన్నుకునేలా ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ప్రకారం… రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం ఎన్నికలు జరిగాయి. తాడిపత్రిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో… వైసీపీ సభ్యలు దీనికి గైర్హాజర్ అయ్యారు. టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంలోనే ఆ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలని.. మళ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని… సవాల్ చేశారు. దానికి ప్రభాకర్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే… ఎన్నికలకు వెళదామని సవాల్ చేశారు. ఈ సవాళ్లు.. ప్రతి సవాళ్లు అలా కొనసాగుతూండగానే వ్వవహారం కేసుల వరకూ వెళ్లింది.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ కుటుంబం తీవ్రఒత్తిడికి గురవుతోంది. అనేక కేసులను వారు ఎదుర్కొంటున్నారు. బస్సుల బిజినెస్.. మైనింగ్ వ్యాపారం ఇలా అనేకం… మూతబడిపోయాయి. అయినా జేసీ బ్రదర్స్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వంపై పోరాటంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. తాడిపత్రిలో మెత్తగా ఉంటే… రాజకీయం నడవదని దూకుజుగా ఉండాలని… వారు ఆ తరహా రాజకీయం చేస్తున్నారు. కేసులు పెట్టినా తగ్గడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close