వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌ఈసీ..!

వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించాలని వారి జోక్యాన్ని సహించేది లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనేక చోట్ల వాలంటీర్లు ఓటర్ స్లిప్‌లు పంచుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో వాలంటీర్ల తీరుపై వివరాలు సేకరించిన ఎస్‌ఈసీ రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు..ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అభ్యర్థుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని.. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓటర్ స్లిప్పులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని.. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లను ఎస్‌ఈసీ ఆదేశిచింది.^ వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించింది. వాలంటీర్లపై పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన ఆరోపణలపై.. ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించిన ఎన్నికల కమిషన్‌ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించడం కోడ్‌ ఉల్లంఘనేనని.. కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు సర్క్యూలర్ పంపింది.

నిజానికి వాలంటీర్లను ఎన్నికలకు విధులకు దూరంగా ఉంచాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పుడెవరూ పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసినా నిమ్మగడ్డ స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను కలెక్టర్లు పాటిస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే అధికార పార్టీ వాలంటీర్లను కేంద్రంగా చేసుకునే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close