డిల్లీ సి.ఎం. కేజ్రీవాల్ అరుదయిన పురస్కారం

లండన్ లో మేడం టుస్సాడ్ మ్యూజియం గురించి ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ మైనపు బొమ్మల మ్యూజియంలో ప్రపంచంలోని ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేస్తారు కనుక అందులో తమ మైనపు బొమ్మ కలిగి ఉండటం చాలా గౌరవంగా అందరూ భావిస్తారు. ఆ మ్యూజియంలో భారత్ కి సంబంధించి జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషణ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు వారి విగ్రహాల సరసన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.

ఈమేడం టుస్సాడ్ మ్యూజియంలో నానాటికీ విగ్రహాల సంఖ్య పెరిగిపోతోంది కనుక లండన్ తో బాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో కూడా శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక డిల్లీలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో మొట్టమొదటగా అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లుగా భారత్ లో ఆ సంస్థ ప్రతినిధిగా ఉన్న విజ్ క్రాఫ్ట్స్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఒక లేఖ ద్వారా తెలియజేసింది. వచ్చే ఏడాదికల్లా ఈ మ్యూజియం సిద్దమవుతుందని ఆ సంస్థ తెలియజేసింది.

దానిలో ప్రధాని నరేంద్ర మోడి, సోనియా గాంధీ, రాహుల్ గాంధిలకు ప్రాధాన్యం ఈయకుండా అందరి కంటే ముందుగా అరవింద్ కేజ్రీవాల్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, అది కేజ్రీవాల్ కి దక్కిన అపూర్వమయిన గౌరవమని చెప్పవచ్చును.

భారత్ లో మ్యూజియం పెడుతున్నారు కనుక మున్ముందు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కవిత, బొత్స సత్యనారాయణ, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వంటివారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారేమో చూడాలి. లేకుంటే సంబంధిత వర్గాల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close