వక్ఫ్ చట్ట సవరణలు పార్లమెంట్ లో ఆమోదం పొందాయి. రాష్ట్రపతి గెజిట్ కూడా రిలీజ్ చేశారు. వైసీపీ సైలెంట్ గా సపోర్టుగా చేసిందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ రాజకీయం చేసుకుంటూ ఏపీలో తిరుగుతున్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన.. ముస్లింలను రెచ్చగొట్టేందుకు ఏపీలో పర్యటిస్తున్నారు. తాను వచ్చిన పని చూసుకోకుండా.. లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం… అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిపోతున్నారు.
చంద్రబాబు లోకేష్కు సీఎం పదవి ఇవ్వాలని ఎవరూ అడగని.. అక్కర్లేని సలహాలు ఇస్తున్నారు. టీడీపీలో ఎప్పుడు ఎవరికి.. ఎలాంటి పదవి ఇవ్వాలో.. ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించారో వారు చూసుకుంటారు. అసదుద్దీన్కు ఆ దురదెందుకు?. పాతబస్తీలో మత కలహాలు రేపుతూంటే.. సీఎం అయిన మెదట్లో చంద్రబాబు అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఆ సమయంలో అసదుద్దీన్కూ బడితెపూజ జరిగింది. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిస్తే ఎవర్నీ సహరించరు. అలాగే పాతబస్తీలో మజ్లిస్ ప్రభావాన్ని .. ఎంబీటీకి మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు తగ్గించారు. ఓ దశలో.. మజ్లిస్కు ఎంబీటీ పోటాపోటీగా మారింది.
తర్వాత రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ అధికారంలోకి రావడంతో .. ఎంబీటీని తొక్కి పడేశాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇటీవల ఎంబీటీ కాస్త బలం పుంజుకుంది. అతి కష్టం మీద రెండు, మూడు నియోజకవర్గాల్లో మజ్లిస్ బయటపడింది. ఎంబీటీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తే.. మజ్లిస్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అందుకే బీఆర్ఎస్ ను డంప్ చేసి కాంగ్రెస్ కు సరెండయ్యారు. ఇప్పుడు ఏపీలో జగన్ రెడ్డి కోసం అప్పుడే వచ్చి రాజకీయం చేస్తున్నారు. అయినా మజ్లిస్ ను నమ్ముకుని ఏపీ ముస్లింలు సముద్రంలో దూకడానికి సిద్ధమవుతారా?. టీడీపీలో ఎవరు ఏ పదవిలో ఉంటే.. అసదుద్దీన్కు ఎందుకు ?