రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమాని రెడీ చేస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈలోగా `అనార్కలి` సినిమాని మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. జూన్లో షూటింగ్ మొదలెట్టే అవకాశం ఉంది. 2026 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆలోచన. ఒకవేళ సంక్రాంతి రేస్ మిస్సయితే 2026 వేసవికి విడుదల చేస్తారు.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఓ నాయికగా కేతిక శర్మని ఇది వరకే ఎంచుకొన్నారని తెలుస్తోంది. ఇప్పుడు రెండో నాయికగా ఆషికా రంగనాథ్ని తీసుకొన్నారని సమాచారం. ‘నా సామిరంగ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆషిక. ‘విశ్వంభర’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకొందని టాక్.
ఒక దశలో మమితా బైజు, కయాడు లోహార్ పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే వీళ్లిద్దరి కాల్షీట్లు దొరకడం కష్టమైందని తెలుస్తోంది. జూన్లో మొదలెట్టి, నవంబరులో పూర్తి చేయాలన్నది ప్లాన్. హీరోయిన్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రాజెక్ట్ ముందుకు కదలదు. అందుకే వీళ్ల స్థానంలో కేతిక, ఆషిక రంగనాథ్లు వచ్చారు. అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది.