రోజాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన సొంత కార్యకర్తలు..!

ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో గొడవ పడి.. వారిపై కేసులు పెట్టడం.. వారితో కేసుసు పెట్టించుకోవడం.. సహజంగా.. రాజకీయ నేతలు అనే వారికి కామన్. కానీ నగరి శాసనసభ్యురాలు రోజా మాత్రం.. ప్రత్యేకం. ఆమె సొంత పార్టీ వాళ్లపైనే.. ఫైరవుతుంది. వారిపైనే కేసులు పెడుతుంది. వారు కూడా.. ఆమెపై ఫైరవుతారు. కేసులు కూడా పెట్టారు. వారంతా.. ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో.. రోజాపై అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేశారా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. రోజా కూడా.. వారంతా వైసీపీ కార్యకర్తలేనని ఒప్పుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో తన కోసం పని చేయలేదని.. తనకు నమ్మకద్రోహం చేశారని అంటున్నారు.

రోజా.. తమను పట్టించుకోకుండా.. అంటే వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రోజా.. కార్యకర్తలను సర్ది చెప్పకపోగా.. వారిని మరింత రెచ్చగొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి రెచ్చగట్టడంతో పాటు.. వారిపై కేసులు కూడా పెట్టారు. వారంతా తమ పార్టీ వారని ఒప్పుకుంటూ కూడా.. కేసుల విషయంలో రాజీ పడలేదు. దాంతో వారు కూడా.. వెనక్కి తగ్గకుండా… పోరాటం ప్రారంభించారు. తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన…టీడీపీలోనో.. మరో పార్టీలోనే అయితే.. పోలీసులు ఇప్పటికి.. కేసులు పెట్టేసి ఉండేవారు.

కానీ అక్కడ అధికార పార్టీలో జరిగిన గొడవ కాబట్టి..పోలీసులు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఓ గ్రామంలో.. పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉండే గొడవను.. రోజా కావాలనే పెంచిపెద్దది చేసిందని.. ఓ సారి పిలిచి మాట్లాడితే.. అందరూ సర్దుకుపోయేవారన్న భావన వైసీపీలోనే వినిపిస్తోంది. కానీ అలా సామరస్యంగా పరిష్కరించుకుంటే.. రోజా ఎందుకవుతారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close