సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్లే ముందు ఎంపీ అవినాష్ రెడ్డి.. సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఇందుకోసం ఆయన లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసానికి వచ్చారు. ఏ అంశాలపై చర్చించడానికి వచ్చారో స్పష్టత లేదు కానీ.. ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారని వైఎస్ జగన్ భార్య భారతి నిర్వహిస్తున్న సాక్షి మీడియా ప్రకటించింది. అయితే వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదాలున్నాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.

వివేకా హత్య కేసులో నిందితుల్ని రక్షిస్తున్నారన్న అనుమనంతోనే జగన్ కు .. కొంత మంది కుటుంబ సభ్యులు దూరం జరిగారని చెబుతున్నారు. షర్మిల కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి విజయమ్మతో భేటీ కావడం వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. మరో వైపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్లే ముందు సీబీఐ అధికారులకు షరతులు పెడుతూ లేఖలు రాశారు.

వివేకానంద రెడ్డి కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని …పని గట్టుకొని ఓ వర్గం మీడియా తనపై లేని పోని కథనాలను ప్రచారం చేస్తోందని చె ..తప్పు దోవబట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని …అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు. తనతోపాటు ఒక న్యాయవాది వెంటే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనిపై సీబీఐ అధికారుల స్పందనపై స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close