గంటా చేరగా లేంది కొణతాల చేరితే తప్పేమిటి?

“గంటా శ్రీనివాసరావు తెదేపాలో చేరగా లేంది కొణతాల చేరితే తప్పేమిటి?”ఈ మాట అన్నది ఎవరో కాదు కొణతాల, గండి బాబ్జీని తెదేపాలో చేర్పిస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడు. మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గానికి, అయ్యన్న వర్గానికి చాలా కాలంగా పొసగడం లేదనే విషయం పెద్ద రహస్యమేమీ కాదు. నిజానికి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరుతునప్పుడు అయ్యన్న పాత్రుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు గంటా తన అనుచరులతో కలిసి సమావేశం పెట్టుకొని అందుకు చాలా బాధపడ్డారు కూడా. అప్పటి నుండి రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి ఇద్దరూ వైకాపాను వీడిన తరువాత వారిని తెదేపాలోకి తీసుకువద్దామని అయ్యన్న అప్పుడే ప్రయత్నించారు. కానీ అప్పుడు గంటా శ్రీనివాసరావు అడ్డుకోగలిగారు. కానీ ఈసారి గుట్టు చప్పుడు కాకుండా వారిద్దరినీ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసేసారు. దానితో చంద్రబాబు నాయుడు తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా తమ రాజకీయ ప్రత్యర్ధులను పార్టీలోకి తీసుకొంటున్నారని గంటా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీడియా అయ్యన్న పాత్రుడు దృష్టికి తెచ్చినప్పుడు అయన పైవిధంగా జవాబిచ్చారు. గంటా చేరిక పట్ల తాము అభ్యంతరాలు వ్యక్తం చేసామని, కానీ పార్టీ విస్త్రుత ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం నిర్ణయానికి తల వంచామని అన్నారు. కనుక ఇప్పుడు వేరెవరో వచ్చి పార్టీలో చేరుతుంటే దానికి గంటా శ్రీనివాసరావు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close