మోడి ప్రభుత్వంపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: నరేంద్రమోడి మద్దతుదారుగా పేరున్న యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వ పాలనలో నల్లధనం పెరిగిపోతూనే ఉందని అన్నారు. నల్లధనం రెండు రకాలని, ఒకటి కుంభకోణాల ద్వారా సృష్టించబడేదని, రెండోది పన్నుల ఎగవేత ద్వారా ఏర్పడేదని అన్నారు. ఈ సంవత్సరమున్నర కాలంలో ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. దేశంలో మత అసహనం లేదని అన్నారు. అదే ఉండి ఉంటే ఆమిర్ ఖాన్ కిరణ్ రావును వివాహం చేసుకోగలిగేవాడే కాదని చెప్పారు. దేశంలో ఉన్న అందరి డీఎన్ఏ ఒక్కటే అన్నారు. తనకు గాళ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. అయితే చాలామంది తనకు ప్రపోజ్ చేశారని, ఒక నటికూడా అలాగే చేస్తే తాను పారిపోయానని తెలిపారు. అమృత్ బజార్ పత్రిక గ్రూప్ వారి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న దీవులలో ఒకదానిని తీసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర షిప్పింగ్ శాఖమంత్రి నితిని గడ్కరి బాబా రాందేవ్‌‍కు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి దీవుల వలన టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందని గడ్కరి నిన్న ఢిల్లీలో ఒక కార్యక్రమంలో అన్నారు. దేశవ్యాప్తంగా ఇలా అభివృద్ధి చేయటానికి అవకాశం ఉన్న 70 లైట్ హౌస్‌లు, 700 దీవులను గుర్తించినట్లు తెలిపారు. యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌లలో రెండు దీవులను తీసుకుని టూరిజం సెంటర్‌లుగా అభివృద్ధి చేయటానికి ఆసక్తి చూపారని చెప్పారు. ఈ 700 దీవులను కేటాయించటానికి వేలంపాటలు నిర్వహిస్తామని గడ్కరి తెలిపారు. బాబా రాందేవ్ స్కాట్‌ల్యాండ్‌లోని ఒక దీవిని ఇలాగే యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలొచ్చాయి. కేంద్రం అందుకే ఈ ఆఫర్‌ను రాందేవ్‌కు ఇస్తున్నట్లు కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close