దుర్గ గుడి పాలక మండలి సభ్యురాలిగా బచ్చు మాధవి -ఈమె ఎవరో తెలుసా ?

ఏపీ ప్రభుత్వం దుర్గ గుడి పాలక మండలి సభ్యులను నియమించింది. చైర్మన్ కర్నాటి రాంబాబు అంటే విజయవాడలో పేరు మోసిన కాల్ మనీ వ్యాపారి అని అందరికీ తెలుసు. ఇక సభ్యుల్లో ఒకరి పేరు అందర్నీ ఆకర్షించింది. ఆమె బచ్చు మాధవికృష్ణ. ఈమె గురించి చెప్పుకోవాలంటే.. ముందు మనం కొన్ని ఘటనల్ని గుర్తు చేసుకోవాలి.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. పసి పిల్లని కూడా వదలకుండా భయపెట్టి ఇంట్లో అంతా విధ్వంసం చేసి వచ్చింది ఓ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కు నాయకత్వం వహించింది మహిళ. ఆమె పేరు బచ్చు మాధవి. ఈ కేసులో ఆమె ఏ వన్ నిందితురాలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న కేసుకూడా ఆమెపై ఉంది. ఇటీవల దేవినేని అవినాష్ ను గడప గడపకూ కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళ ప్రశ్నించిందని ఆమె ఇంటికి వెళ్లి కళ్లల్లో కారం కొట్టి దాడిచేసింది ఓ గ్యాంగ్. ఆ గ్యాంగ్ కు ప్రెసిడెంట్ బచ్చు మాధవి. ఆమె… ఇప్పుడు దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు.

విజయవాడలో దేవినేని అవినాష్ నడిపే చిల్లర గ్యాంగుల్లో ఈమెది కీలక పాత్ర. కొంత మంది మహిళల్ని వెంటేసుకుని అవినాష్ చెప్పిన వారిపై దాడులు చేసి రావడమే వీరి పని. అధికారలో ఉన్నారు కాబట్టి… చట్టం వర్తించదు కాబట్టి ఆమె.. తను మహిళ అనే అడ్వాంటేజ్ ను వాడుకుని అవినాష్ చెప్పిన పనల్లా చేస్తారు. మహిళలను ఉపయోగించుకుని ఇలాంటి పనులేంటి అని అందరూ అవినాష్ పై సెటైర్లు వేస్తారు. అందుకే పదవి ఇప్పించారు.

దుర్గగుడి పాలకమండలిలో ఇలా నేరస్తులు చేరడం.. భక్తుల్ని కూడా ఆవేదనకు గురి చేస్తోంది. కానీ ఎవరూ నోరెత్తలేరు. ఎత్తితే బచ్చు మాధవి అండ్ గ్యాంగ్… కారం తీసుకుని ఇళ్లపై పడి దాడి చేసి కొడుతుంది. మహా అయితే కేసు అవుతుంది కానీ.. బాధితులు మాత్రం బాధపడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close