బాలకృష్ణ ఒక్క ట్వీట్ – మూడు రోజులుగా వైసీపీ గగ్గోలు !

బాలకృష్ణ ఒక్కటంటే ఒక్క ట్వీట్ చేశారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై మండిపడ్డారు. అంతే వైసీపీ నేతలకు అదే రోజూ కల్లోకి వస్తున్నట్లుగా ఉంది. మూడు రోజులుగా బాలకృష్ణను తిట్టిన వారు తిట్టినట్లుగానే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. కొడతామని బెదిరిస్తున్నారు. రోజా లాంటి వాళ్లు ఫ్లూటు అంటూ డైలాగులు కూడా మార్ఫింగ్ చేసి చెప్పారు. అయితే బాలకృష్ణ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు.

బాలకృష్ణ స్పందనపై వైసీపీలో ఇంత స్పందన ఎందుకు అనేది.. చాలా మందికి అర్థం కాలేదు కానీ వైసీపీలో ఓ స్థాయిలో ఉండే వారందరికీ అర్థమైపోయింది. బాలకృష్ణ చేసిన ట్వీట్.. పైస్థాయిలోని వారికి ఆగ్రహం తెప్పించింది. తమను అంత మాట అంటారా .. అంతకు పది మాటలు అనాల్సిందేనని సూచనలు వచ్చాయి. ఆ సూచనలు నేరుగా ఎప్పుడు ఎవరు మీడియాతో మాట్లాడాలి.. ఎవరు సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి.. ఎలా పెట్టాలన్నదానిపై స్పష్టమైన కార్యాచరణలో పార్టీ ఆఫీసు నుంచి సందేశాలు వెళ్తున్నాయి. ఆ ప్రకారం వారు స్పందిస్తున్నారు.

వైసీపీలో పదవులు పొందిన నేతలెవరకీ స్వేచ్చ లేదు. వారి స్వాతంత్రం అంతా హైకమాండ్ దగ్గర ఉంటుంది. వారు పదవుల్లో ఉంటారనే పేరే కానీ అధికారవిధుల్లో ఎక్కడా కనిపించరు. వారి పేరు మీద అసలు పని సలహాదారు చేస్తారు. పదవుల్లో ఉన్న వారు ఏం చేస్తారంటే.. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే బూతుల ప్రసంగాలను చదివి వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి డ్యూటీ బాలకృష్ణను విమర్శించడం. అదే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close