కడప జిల్లాలో బాలకృష్ణ పర్యటన…దానికేనా?

హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవ్వాళ్ళ కడప జిల్లాలోని కమలాపురంలో పర్యటిస్తున్నారు.జిల్లాకు చెందిన తెదేపా నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను కలిసేందుకు కమలాపురం తరలివచ్చేరు. తెదేపా నియోజకవర్గ ఇన్-చార్జ్ నర్సింహా రెడ్డి, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితర తెదేపా నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ కొత్తగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లాలో ప్రసిద్ది చెందిన బండలాగుడు పోటీలను బాలకృష్ణ ప్రారంభించారు.

బాలకృష్ణ కడప జిల్లా పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనగానే పైకి కనిపిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి కంచుకోట వంటి కడప జిల్లాలో ప్రజలను తెదేపావైపు ఆకర్షించే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు ఆయనను కడపకి పంపించి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. వైకాపా కార్యకర్తలలో కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు కనుక, అటువంటి వారిని కూడా ఈ పర్యటన ద్వారా తెదేపా వైపు ఆకర్షించాలనే ఆలోచనతోనే బాలకృష్ణని పంపి ఉండవచ్చని భావిస్తున్నారు. కడప జిల్లాలో తెదేపాను బలోపేతం చేసుకోవడానికి కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజుల పాటు కడపలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు బాలకృష్ణ పర్యటన కూడా అందుకేనని అనుమానించకతప్పదు. ఒకవేళ ఆయన పర్యటనలో లేదా ఆ తరువాత గానీ వైకాపాకి చెందిన వారెవరయినా తెదేపాలో చేరినట్లయితే ఆ అనుమానాలే నిజమని నమ్మవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close