బాలినేని కూడా అపోలోకే చలో..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా సోకింది. ఆయన కూడా… ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెట్టుకోలేదు. నేరుగా అపోలోకే వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకూ.. అధికార పార్టీగా వైసీపీలో ఉన్న వారు.. ఎవరు కరోనా బారిన పడినా… పొరుగు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకే పరుగులు పెడుతున్నారు. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి అంబటి రాంబాబు వరకూ అందరిదీ అదే బాట. ప్రభుత్వం…అత్యున్నత స్థాయి వైద్య సౌకర్యాలు అందిస్తోందని.. మాటలు చెబుతోంది కానీ.. చేతల్లో మాత్రం.. తమ సొంత వైద్యంపై నమ్మకం లేక…, పొరుగు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుకు పరుగులు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్స ఎలాంటిదో… అధికార పార్టీ నేతలకు బాగా తెలుసని… ఈ కారణంగానే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ప్రజలు తమపై తెస్తున్న ఒత్తిడితో… కొంత మంది ప్రజాప్రతినిధులు.. మీడియా ముందే… అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి ఎవరైనా నేతలు ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో చేరినా.. వెంటనే… ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. తెలంగాణలో 80ఏళ్లు దాటిన నేతలు.. కరోనా బారిన పడినా… కోలుకున్నారు. కానీ 59 ఏళ్ల మాణిక్యాలరావు కరోనా బారిన పడి .. ప్రభుత్వ కోవిడ్ సెంటర్‌లో చేరారు. వారానికే ఆయన పరిస్థితి సీరియస్‌గా మారడంతో.., విజయవాడ ప్రభుత్వాసుపత్రికి మార్చాల్సి వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది.

మాణిక్యాలరావు, సున్నం రాజయ్య లాంటి నేతలు.. కరోనాతో చనిపోవడంతో… పాజిటివ్ వచ్చిన వారెవరూ.. నిర్లక్ష్యం చేయడం లేదు. వెంటనే..హైదరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం.. ఆయన కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది. వారు కూడా.. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్‌లో చేరినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ వైద్యం చేసుకోవాలో వారి ఇష్టం కానీ.. ఇలా చేయడం వల్ల సొంత ప్రభుత్వం ఇస్తున్న వైద్యంపై.. భరోసాను.. ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close