ప్రభుత్వ తప్పిదాల వల్లే స్థానిక ఎన్నికల రద్దు..!?

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రక్రియ రద్దు చేస్తారన్న కారణంగానే.. నిమ్మగడ్డ ప్రసాద్‌ను మళ్లీ ఎస్‌ఈసీ పదవిలో కూర్చోకుండా.. ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. ఇప్పుడు.. నిమ్మగడ్డకు అలాంటి అవకాశం లేకుండా.. నిబంధనల ప్రకారమే… స్థానిక ఎన్నికలు రద్దయిపోయేలా చేస్తోంది. దీనికి కారణం.. వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పిదాలే. ఏపీ సర్కార్ ఎన్నికల ప్రక్రియను మార్పు చేస్తూ.. ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. 21 రోజుల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ఆ ఆర్డినెన్స్ ఉంది. అయితే.. ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలో తీసుకు రాలేదు. బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశం పెట్టినా… ఆ ఆర్డినెన్స్ ను చట్ట రూపంలోకి తేలేకపోయారు.

దాంతో ఆరు నెలలు ముగియగానే.. ఆటోమేటిక్‌గా.. ఆ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లింది. అయితే.. ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఒకే అంశంపై రెండు సార్లు ఆర్డినెన్స్ తీసుకు రావడం.. చెల్లదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే … ఎన్నికల ప్రక్రియ రద్దు అవడం ఖాయమని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ ను వెంటనే చట్ట రూపంలోకి తీసుకువచ్చినా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ చెల్లదని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

అయితే.. ఒక వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ముందుగానే… ఈ అంశంపై… స్థానిక ఎన్నికలు ఎక్కడ ఆగాయో.. అక్కడి నుంచే కొనసాగించాలని కానీ.. లేదా మొత్తం ప్రక్రియను రద్దు చేయాలని కానీ నిర్ణయం తీసుకుంటే… న్యాయస్థానాలు కూడా…జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగవ్యవస్థ. అందుకే… నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close