పీవీ, ఎన్టీఆర్‌లకు కాషాయం పూసేసిన బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పొలిటికల్‌గా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కేవలం రెండు వారాలు. అయినా సరే.. కానీ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా బండి సంజయ్ ప్రచార బ్యాటింగ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని పక్కగా ఉపయోగించుకుంటున్నారు. నామినేషన్ల పర్వమప్పుడు.. వరద సాయం ఆపడానికి బండి సంజయే కారణం అంటూ తన పేరుతో టీఆర్ఎస్ సృష్టించిన ఓ ఫేక్ లెటర్‌తో ఆయన కంగారు పడలేదు. దాన్నే అస్త్రంగా చేసుకుని పార్టీని పాతబస్తీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత కూడా ఆయన దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. నిర్మోహమాటంగా తాను హిందూత్వ వాదినేనని చెప్పుకుంటూ.. మజ్లిస్‌పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. టీఆర్ఎస్ ఈ ట్రాప్‌లో పడింది. దీన్ని వివాదాస్పదం చేయాలనుకున్నారు కానీ.. అది మరో విధంగా హైలెట్ అయింది. ఈ సారి అక్బరుద్దీన్.. బండి సంజయ్ కు చాన్సిచ్చారు. అనాలోచితంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత గురించి మాట్లాడారు. ఇక బండి సంజయ్ ఊరుకుంటారా..? నిజానికి ఆ ఇద్దరూ బీజేపీతో సంబంధం లేని వాళ్లే. అలా అని బండి సంజయ్ రిజర్వేషన్లు పెట్టుకోలేదు… రంగంలోకి దిగేశారు. ఇద్దరికీ.. కాషాయం పులిమేసి.. మహానుభావులుగా వాడకం ప్రారంభించేశారు. ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని కూల్చుతారా?.. అయోధ్య అంశంపై పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కూల్చుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లకు నివాళులర్పిస్తానని.. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయబోతున్నారు. అటు టీడీపీ ఫ్యాన్స్‌ని ఇటు పీవీకి మద్దతుగా ఉండే కాంగ్రెస్ ఫ్యాన్స్‌ని బండి సంజయ్ ఏక కాలంలో ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా తమ పార్టీకి చెందని వారిని ఇతర పార్టీలు ఓన్ చేసుకోవు. కానీ బీజేపీ స్టైల్ వేరు. సర్దార్ పటేల్ ను బీజేపీ.. ఓన్ చేసుకున్న విధానం చూసి.. బహుశా.. ఆయన బీజేపీ నేత అయి ఉండవచ్చని అనుకునే జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు.. బండి సంజయ్ పీవీ, ఎన్టీఆర్ విషయంలో అలాంటి వ్యూహమే పాటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close