తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన తీసుకొస్తున్నారు. తెలంగాణలోనూ వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయన్నారు. తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం… శవాలొస్తే మీవి…. శివం వస్తే మావి అందుకు మీరు సిద్ధమా?’ అని మజ్లిస్ చీఫ్‌కు సవాల్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. అందులో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ యాత్రలో దారుణమైన భాషను బండి సజయ్ వాడారు. బీజేపీకి అలవాటైన విధంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలని కరీంనగర్ ప్రజలు తనను పంపారని.. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నానని ప్రకటించారు. కరీంనగర్ నడిబొడ్డున ఈద్గా … వేములవాడలో దర్గా పోవాలంటే రామరాజ్యం రావాల్సిందేనని సంజయ్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు…. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందని ప్రకటించారు.

ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఊర్దును శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. మదర్సాలను శాశ్వతంగా నిషేధించి.. మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో హిందువులకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రతి ఒక్క హిందువు కలిసి కట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం బండి సంజయ్ .. చాలా దూకుడుగా ఉన్నారని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close